ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఉత్సాహం కలిగించే అంశం. కానీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఫ‌హల్గామ్ దాడి తర్వాత జరిగే సైనిక కార్యాచరణలు వంటి తాజా పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ప‌ట్ల స‌గ‌టు భార‌తీయుడిలోనూ మిశ్రమ స్పంద‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కొందరు ఈ సందర్భంలో పాక్‌తో బాండింగ్ ప్రజాస్థాయిలో అనుచితమని భావిస్తూ బాయ్‌కాట్ క్యాంపెయిన్లు ప్రారంభించారు. మరోవైపు స్పోర్ట్స్ బోర్డులు, ఫ్రాంఛైజీలు, ఫైనాన్షియల్ లాభాల దృష్ట్యా ఈ అవకాశాన్ని వదులుకోవడం క‌రెక్ట్ కాదేమో అని చెపుతున్నారు. ఫ‌హ‌ల్గామ్ దాడి, ఆపరేషన్ ‘సింధూర్’ వంటి ఘటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను గాఢంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజ‌ల్లో పాక్ ప‌ట్ల ఆగ్ర‌హావేశాలు పెరిగిపోయాయి. “ మీరు మా పైన దాడి చేసిన వారితో ఎలా ఆట ఆడవచ్చు ? ” అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఒక వర్గం మాత్రం స్పోర్ట్స్‌ను వేరుగా చూడాలని, క్రికెట్ ద్వారా కూడా ఒక రకమైన డిప్లొమసీ యాక్సెస్ ఉండగలదని తేలికగా వాదిస్తున్నారు. ఈ రెండు విధాల వాదనలు మీడియా వేదికల మీద త‌ట‌స్థ‌మైన కామెంట్లు వినిపిస్తున్నాయి.


బీసీసీఐ, టీవీ హక్కుల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ సంస్థల నుంచి భారత్ - పాక్ మ్యాచ్ భారీ ఆదాయ వనరుగా ఉంటుంది. టికెట్, బ్రాడ్కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్ డీల్‌లు, మార్కెటింగ్ ఇవన్నీ బోర్డులకు భారీ ఆదాయం ఇస్తాయి. అందుకే బీసీసీఐ ఇలా ఒక మ్యాచ్‌ను వదులుకోవడానికి కూడా ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం వారి వ్యాపార వైఖరి స్పష్టం చేస్తోంద‌ని కొంద‌రు చెపుతున్నారు. కొందరు విమర్శకులు మాత్రం ఈ ఆదాయాన్ని పాక్‌కు చేరువ చేస్తే తిరిగి వాళ్లు అదే ఆదాయంతో మ‌న‌పై దాడి చేస్తున్నార‌ని ఆరోపించే వారు కూడా ఉన్నారు.


క్రీడా వర్గాలు మాత్రం అంతర్జాతీయ టోర్నీలో పాయింట్లు, ర్యాంకింగ్, టైటిల్ అవకాశాలను కోల్పోకుండా పోరాడాల‌ని... మ‌రీ ముఖ్యంగా ఆసియా కప్ వంటి టోర్న‌మెంట్‌లో ఒక్క మ్యాచ్ వ‌దులుకున్నా అది గెలుపు అవ‌కాశాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఈ విష‌యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారు వ్య‌క్తం చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా మాత్రం గ‌తంలోలా భార‌త్ - పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ ప‌ట్ల ఉన్నంత ఆస‌క్తి అయితే ఈ సారి ఎందుకో కామ‌న్ జ‌నాల్లోనూ లేదు అన్న‌ది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: