ఇక బిగ్ బాస్ షో ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది.. ఇక నుంచి ఈ షో 24 గంటల పాటు ఉండబోతోందని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ షో 84 రోజుల పాటు 17 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్న పోతున్నట్లుగా తెలియజేశారు.. ఈసారి కొత్తగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఇక గత సీజన్లో పాల్గొన్న వారిని  వారియర్స్ గా , కొత్తగా వచ్చే వారిని ఛాలెంజర్స్ గా తెలియజేయడం జరుగుతుంది.. ఇక వీరిరువురి మధ్య పోటీ ఉంటుందని నాగార్జున తెలియజేశాడు.


ఇక ఇందులో భాగంగా వారియర్ కేటగిరీలో  మొదట కంటెస్టెంట్ గా ఆషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే డ్యాన్స్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. ఇక నాగార్జున మాట్లాడుతూ.. ఆషూ రెడ్డి ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అంటూ సెటైర్లు వేయడం కూడా జరిగింది. బిగ్ బాస్ ఇంట్లో ఏం చేస్తావ్ అని నాగార్జున అడగగా.. బిగ్బాస్ ఇంట్లో అన్ని పనులు చేస్తాను కానీ.. ఒక్క ప్రేమను మాత్రం అసలు పెట్టుకొనని తెలియజేసింది.. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు రాహుల్ ఎలాంటి సలహా ఇచ్చాడు అని నాగార్జున అడగగా.. తనలా  మాత్రం ఆడవద్దని తెలియజేశాడు అని చెప్పుకొచ్చింది.


హౌస్ లో ఏం చేసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేయమని తెలిపాడు అంటూ చెప్పుకొచ్చింది ఆషూ రెడ్డి. మరి బిగ్ బాస్ హౌస్ లో ఏమి  చేస్తుందో చూడాలి.. ఇక ఇంట్లోకి మొదట కంటెస్టెంట్ గా వెళ్లాను.. అలాగే చివరి కంటెస్టెంట్ గా వెళ్లేలా చేయమని కోరుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త ఆషూ రెడ్డిని చూపిస్తానంటూ ఆమె తెలియజేసింది. ఏది ఏమైనా ఈ సారి ఎవరి అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ షో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: