సెలబ్రిటీలలో ఎక్కువమంది స్వార్థంతోనే వ్యవహరిస్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. సామాన్య ప్రజల గురించి, వారి యొక్క కష్టాలను తెలుసుకుని.. ఆ సమస్యలను పరిష్కరించే సెలబ్రెటీలను చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పవచ్చు. అయితే ఇతర సెలబ్రెటీలతో పోలిస్తే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయ్ మాత్రం కాస్త భిన్నమైన క్యారెక్టర్ అని చెప్పవచ్చు.. ఆడ పిల్లలకు ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడడం తో పాటు ఆ సమస్యకుం..తనదైన శైలిలో పరిష్కారానికి దారి చూపిస్తుందని చెప్పవచ్చు.


తనకు లాగే ఒక అమ్మాయి కూడా  తన తల్లి శాపనార్థాలు పెడుతోందని చిన్మయికి తెలియజేసింది.. అందుకు తనదైన శైలిలో తగిన సమాధానాన్ని కూడా తెలిపింది. తన తల్లి తన వివాహం గురించి వేధిస్తోందని నచ్చిన విధంగా ప్రవర్తించక పోయినా.. తన తల్లి కి నచ్చిని పని చేయకపోయినా శాపనార్థాలు పెడుతోందని ఆ యువతి తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా తన తల్లిని సంతోషంగా ఉంచకపోతే మట్టి కొట్టుకొని పోతావ్ అని తిడుతోందని ఆ అమ్మాయి తెలియజేస్తోంది.. ఇవన్నీ నిజమవుతాయా అని చిన్మయ్ నీ  ఆ అమ్మాయి అడిగింది.


అందుకు చిన్మయి.. మాట్లాడుతూ తల్లి కూతుర్ని శపించింది అంటే అది ఒక వింత రోగం అని చెప్పవచ్చు అని తెలిపింది.. తల్లి పెట్టే శాపనార్థాలు గురించి ఎవరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని చిన్మయి తెలియజేసింది. తల్లి కూడా ఒక మనిషే కదా ఆమె పెట్టే శాపాలు గురించి భయాందోళనలు చెందవద్దు అని ఆ అమ్మాయికి తెలుపుతోంది. ఇక ఇలాంటి భయాందోళన తొలగించే దిశగా అడుగులు వేయడంతో ఈమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిన్మయి వరుస సినిమాలతో బిజీగా కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. అమ్మాయిలకు ధైర్యం ఇవ్వడంలో చిన్మయి తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. ఎవరైనా సమస్యలలో ఉన్నారు అంటే కచ్చితంగా స్పందిస్తుందని అభిమానులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: