బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఉండేది యాంకర్ అనసూయ అయితే జబర్దస్త్ వీడి ఎప్పుడు బయటకు వెళ్లిందో ఈమె పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అనసూయతో పాటు గతంలో వెళ్లిన కమెడియన్స్ గత కొన్ని రోజులుగా వెళ్లిన కమెడియన్స్ ఎంతో మంది కూడా తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక వీరితోపాటు మరొక యాంకర్ దీపిక పిల్లి కూడా ఈటీవీ ని వదిలేసి స్టార్ మాలోకి వెళ్లడం జరిగింది.అక్కడ కూడా కొద్ది రోజులపాటు కామెడీ స్టార్స్ బాగానే అలరించిన ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కార్యక్రమం కొద్ది రోజులకే మూసివేయడం జరిగింది.


ఇక అంతే కాకుండా పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయి. అవి కూడా అంతగా సక్సెస్ కాలేకపోయాయి. ఇక తర్వాత కనిపించే అవకాశం మళ్ళీ రాలేదు ఈ ముద్దుగుమ్మకు. ఇక మరొకవైపు అనసూయ కూడా ప్రస్తుతం చాలా కష్టాలను ఎదుర్కొంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో అనసూయ అంటే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఆమె ఒక స్టార్ రేంజ్కి రావడానికి ముఖ్య కారణం జబర్దస్త్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


అయితే అలాంటి జబర్దస్త్ను వీడి ఇతర కార్యక్రమంలో యాంకర్ గా, జడ్జిగా కనిపించాలని చాలా ఆశపడింది కానీ అవన్నీ కొద్ది రోజులు మాత్రమే ఆమెకు సంతృప్తిని ఇచ్చాయి. అయితే వీటితో రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే సంపాదించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అనసూయ ,సుధీర్, దీపికా పిల్లి తదితరులు సైతం కనుమరుగయ్యారని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో వీరిని జనాలు కూడా మరిచిపోయి అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే వీరందరూ స్టార్ మా లో కి వెళ్లి తమ కెరియర్ నాశనం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇక వీరందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని బుల్లితెర వర్గాల నుంచి అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: