ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలోనే ప్రతి మనిషి కూడా జీవనం సాగిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనె ప్రతి పనిని కూడా హడావిడిగా చేసేస్తూ ఉన్నాడు. అయితే ఇలా మనుషులు చేసే హడావిడి పనులే కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదికి తేవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పుడు ఇక రైలు ఎక్కే ముందు దిగే ముందు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంతోమంది హడావిడిగా రైలు ఎక్కాలి అనే ఉద్దేశంతో చివరికి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొంతమంది చావుతప్పి కన్ను లొట్ట పడింది అన్న విధంగా గాయాలతో బయటపడుతున్నారు


 ఇలా ఇటీవలే కాలంలో ఎంతోమంది తొందరపాటు చర్యల వల్ల ఏకంగా రైలు కింద పడిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయిన ఒక వ్యక్తి ఇక అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పాలి. ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం అతనికి భూమి మీద నూకలు తినే భాగ్యం ఇంకా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. పెద్దలు చెబుతూ ఉంటారు కదా భూమి మీద నూకలు తినే భాగ్యం ఉంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా ఏం చేయలేదు అని.


 ఇక ఇతని విషయంలో ఇది నిజం అయింది అని చెప్పాలి. బీహార్ లో ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని భాగల్పూర్ లో ఒక వ్యక్తి హడావిడిగా రైల్వే ట్రాక్ ను దాటడానికి ప్రయత్నించాడు. చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా రైలు దూసుకు రావడంతో రైలు పట్టాలపై పడిపోయాడు. ఇక అతను ప్రాణాలు కోల్పోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక రైలు పట్టాలకు మధ్యలో అలాగే పడుకుండిపోయాడు. దీంతో రైలు అతనిపై నుంచి వెళ్లినప్పటికీ కూడా చిన్నగాయాలతో అతను బయటపడ్డాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: