ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అపురూప, అపూర్వ ఘట్టం ‘పెళ్లి’. కాగా, ఈ వేడుకలో స్నేహితులు, బంధుమిత్రులు, కుటుంబీకులు అందరూ ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వధూవరులు మధురక్షణాలను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేందుకు గాను హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఇందుకు వధువు వరుడిని ఆట పట్టించడం మనం చూడొచ్చు. అలా ఆట పట్టించిన బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే తాజాగా వరుడిని ఈ వధువు డిఫరెంట్‌గా ఆడుకుంది. అతడికి ఒకరకంగా ముచ్చెమటలు పట్టించిందని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వధువు వరుడిని ఏం చేసిందంటే..
 
నెట్టింట ట్రెండవుతోన్న ఈ వీడియోలో వరుడు వధువుకు పూల మాల వేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే, వధువు వరుడికి ఎంతకీ దొరకకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే ఆమె వరుడి నుంచి తప్పించుకునే తిరుగుతూనే ఉంటుంది. కబడ్డీ ఆడుతున్న మాదిరిగా ఆమె అలా చేస్తుండటం చూసి వరుడి కుటుంబీకులు, అతిథులు ఆశ్చర్యపోతుంటారు. చివరకు ఫ్రెండ్స్ హెల్ప్ చేయడంతో వరుడు వధువు మెడలో పూల మాల వేస్తాడు. ఈ వీడియోను మనీశ్ మిత్రా అనే జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట వైరలవుతోంది.


నెటిజన్లు ఈ వీడియో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వధువు వరుడిని ఇప్పుడే ఇలా తిప్పలు పెడుతుందంటే..ఇక ఫ్యూచర్‌లో చుక్కలే అన్నట్లు సంకేతాలిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వరుడి కష్టం చూసి చాలా మంది లాఫింగ్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కాగా, ఇది జైమాల వేడుకలో జరిగిన సంఘటనని జర్నలిస్టు మనీశ్ మిశ్రా పేర్కొన్నాడు. ఈ జైమాల వేడుకను సక్సెస్ ఫుల్ చేసిన ఫ్రెండ్స్‌కు థాంక్స్ చెప్పాలని మనీశ్ పోస్టు పెట్టాడు. నెటిజన్లను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: