 
                                
                                
                                
                            
                        
                        తాజాగా గుంటూరు జిల్లా పట్టాబిపురంలో జరిగిన ఒక ఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. అక్కడ ఇద్దరు మైనర్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. మొదట స్నేహంగా ప్రారంభమైన ఆ పరిచయం క్రమంగా ప్రేమలోకి మారింది. ఇల్లు వాళ్లకు చెప్పకుండా తరచూ బయట కలుసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత వారు శారీరకంగా కలిశారు. తక్కువ వయసులోనే ఈ రకమైన అనుబంధం వారిని పెద్ద తప్పిదానికి దారితీసింది. కొంత కాలానికి ఆ మైనర్ బాలిక గర్భవతిగా మారింది.ఈ విషయం బయటపడటంతో ఇరువురి కుటుంబాలు షాక్కు గురయ్యాయి. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్న వయసులో ప్రేమ పేరుతో ఇలాంటి సంఘటనలు జరగడం సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద హెచ్చరికగా మారింది.
తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ చూపడంలో తప్పేమీ లేదు. కానీ ఆ ప్రేమకు హద్దులు అవసరం. పిల్లలు కోరిన ప్రతిదీ నెరవేర్చడం వాళ్ల భవిష్యత్తును చెడగొట్టే ప్రమాదం ఉంది. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం ముందు వారు దానిని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా సౌకర్యాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం నేర్పించాలి.
ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు — ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి పేరంట్స్ తమ పిల్లల ఆన్లైన్ జీవనశైలిని గమనించాలి. ప్రేమ చూపడమే కాకుండా, శిక్షణ ఇవ్వడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యం. లేకపోతే “పోనీలే పిల్లలు కదా” అనేది ఒక చిన్న మాటగానే కాకుండా, భవిష్యత్తును నాశనం చేసే అజాగ్రత్తగా మారిపోతుంది.ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, గురువులు, సమాజం కలిసి పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలి. ప్రేమతో పాటు క్రమశిక్షణను నేర్పిస్తేనే వచ్చే తరం బలంగా, బాధ్యతాయుతంగా ఎదుగుతుంది.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి