భారత్ లో ప్రసిద్ధి చెందిన సంస్దలలో హీరో మోటార్స్ ఒకటి.. అయితే ఈ సంస్దల నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంస్ద నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. అయితే వీటిపై ప్రస్తుతం భారీ ఆఫర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు.. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

గురుగ్రామ్ ఆధారిత హీరో ఎలక్ట్రిక్ తన ఫ్లాష్ ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్ ని ఇస్తుంది. కంపెనీ తన లీడ్-యాసిడ్ వేరియంట్‌పై దాదాపు రూ. 7,088 తగ్గింపును అందిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ యొక్క లిథియం-అయాన్, లీడ్-యాసిడ్ వేరియంట్‌లపై రూ. 10,500 వరకు పేటీఎం ఆఫర్ ను ఇస్తుంది. 

 

అయితే ఈ నేపథ్యంలోనే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపైన మరో అద్భుతమైన ఆఫర్ ఉంది.. అది ఏంటి అంటే... ఇప్పుడు కేవలం 29 వేలకే స్కూటర్ వస్తుంది. మన భారత్ లో ఒక్క నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లో తప్ప అన్ని చోట్ల 7,088 రూపాయిలు తగ్గుదలతో 29,990 రూపాయలకు అందిస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ బైక్ యువకులకు.. నేర్చుకునే వారికీ అద్భుతంగా ఉంటుంది. 

 

అయితే బండి మహిళలకు అద్భుతంగా పని చేస్తుంది.. ఈ బండి గంటకు దాదాపు 25 కిలోమీటర్ల స్పీడ్ తో నడుస్తుంది.. అంతేకాదు.. ఈ బండికి ఫుల్ ఛార్జింగ్ ఉంటె దాదాపు 50 కిలోమీటర్ల వరుకు ఈ బండి వెళ్తుంది. కాగా హీరో సంస్ద ఇంకా ఎలెక్ట్రిక్ వాహనాలపై మరికొన్ని వాహనాలపై ఆఫర్ ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: