ప్రభుత్వం పై టీడీపీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా పేరితో కలెక్షన్లు చేసుకుంటున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కరెంట్ ఛార్జీల పేరుతో రూ.120కోట్లు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యవసర సరుకులు 75 - 150శాతం పెరిగిపోయాయని... చీప్ లిక్కరు క్వార్టర్ రూ.50లు ఉంటే, ప్రస్తుతం రూ.200లు చేశారని ఆయన ఆగ్రహంవ్యక్తం చేసారు. 

 

నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, కరోనా కోసం ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదవాళ్లకి పట్టెడన్నం పెట్టడానికి వైసీపీ వారికి చేయి రావడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. పాలన ప్రజల కోసం జరుగుతుందో, ప్రజాప్రతినిధుల కోసం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: