ఒక ఆస్తి తగాదా అనంతపురం జిల్లాలో ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అనంతపురం గార్లదిన్నె మండలం మర్తాడు లో  చిన్నారులను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసాడు. మర్తాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు , సుజాత దంపతుల కుమారులను  రాము అనే సమీప బంధువు కిడ్నాప్ చేసాడు. ఇద్దరు చిన్నారులను హత మార్చే  ప్రయత్నం చేసాడు. అయితే వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కొన ఊపిరితో ఉన్న పెద్ద కుమారుడు ఆరేళ్ళ శశిధర్ ను కనేకల్ సమీపంలో గార్లేదిన్నె పోలీసులు గుర్తించి శశిధర్ ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమారుడు మోక్షజ్ఞ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా కనేకల్ చెరువు సమీపంలో మూడేళ్ళ మోక్షజ్ఞ  మృతదేహం దొరికింది. దీనితో అనుమానితుడు రామును బెలుగుప్ప పోలీస్ స్టేషన్   లో విచారించారు. చిన్నారి మరణించడంతో తల్లి తండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: