ద్రోణవల్లి హారిక.. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలుగమ్మాయి.. ఆమె గత నవంబర్‌లో లాత్వియా దేశంలోని రిగాలో గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌ కు హాజరైంది. అయితే ఆ సమయంలో ఆమె లైంగిక వేధింపులకు గురైందట.. ఈ విషయాన్ని ఆమె తాజాగా బయటపెట్టారు. అయితే.. ద్రోణవల్లి హారికతో పాటు అనేక మందికి లైంగింక వేధింపుల లేఖలు వచ్చాయట.


అయితే ఈ లైంగిక వేధింపుల లేఖల వల్ల తన ఆటకు మాత్రం ఇబ్బంది కలగలేదని ఆమె తెలిపింది. ఎందుకంటే ఈ లైంగిక వేధింపుల లేఖ వచ్చినట్టు చివరి రోజు వరకూ తనకు తెలియదట. టోర్నమెంట్‌ చివరి రోజు వరకు ఈ విషయం టోర్నీ నిర్వాహకులు ఆమెకు చెప్పకుండా జాగ్రత్తపడ్డారట. టోన్నీ నిర్వాహకులు ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించారని.. చివరి రోజు వరకు లేఖల గురించి మాకు చెప్పలేదని..  లేఖలను పోలీసులకు అప్పగించారని హారిక తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: