మాజీ సీఎం రోశయ్యను సీఎం జగన్ అవమానించారని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. మాజీ సీఎం రోశయ్యకు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడాన్ని వారు ఖండిస్తున్నారు. మాజీ సీఎం రోశయ్యకు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టాలని వారు కోరుతున్నారు. రోశయ్య అంటే జగన్‌రెడ్డికి ఎందుకంత కక్ష అంటూ ప్రశ్నిస్తున్న ఆర్యవైశ్య ఐక్య కార్యాచరణ సమితి నేతలు.. సంతాప తీర్మానం పెట్టకపోవడం తీవ్రమైన అవమానం అంటూ మండిపడుతున్నారు. జగన్ రెడ్డి చివరకు సంతాప విషయంలోనూ కులం చూస్తున్నారని ఆర్యవైశ్య జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆర్యవైశ్య జేఏపీ ప్రకటించింది. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఇవాళ సభ నివాళులు అర్పించింది. సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. అలాంటప్పుడు మేకపాటికి సంతాప తీర్మనం పెట్టి.. మాజీ సీఎం అయినా రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోవడం ఏంటని ఆర్య వైశ్యులు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: