కొత్త జిల్లాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై మండిపడిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తప్పులు సరిదిద్దుతామంటున్నారు. అయితే చంద్రబాబు ఇలా స్పందించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు మంచి జరగడం చంద్రబాబుకు రుచించడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక చక్కదిద్దుతామని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు చక్కదిద్దకుండా ఏం చేసారని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం కల్పిస్తే చంద్రబాబు ఏం చేసారని నిలదీశారు చంద్రబాబు ప్రజలకు పరిపాలన చేరువ చేయలేదని.. అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. అలా కాకుండా ఇప్పుడు మళ్లీ తాను అధికారంలోకి వచ్చాక చక్కదిద్దుతామని మాట్లాడటం హాస్యాస్పదమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ఇంకా చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: