ఇవాళ ఏపీ సీఎం జగన్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ అవుతున్నారు. త్వరలో సీఎం జగన్.. కేబినెట్‌ను పూర్తిగా మార్చేయబోతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు..ముందుగా సమాచారం ఇచ్చేందుకు సీఎం జగన్ ఇవాళ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో  
మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన అంశంగా అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఏపీలో సీఎం జగన్ కొత్త జిల్లాలు ప్రారంభించారు. 13గా ఉన్న ఏపీ జిల్లాలను ఏకంగా 26కు పెంచారు. ఇది కూడా కీలక నిర్ణయమే.. ఈ జిల్లాల జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సీఎం జగన్ గవర్నర్‌తో చర్చించే అవకాశం ఉంది. ఇదీ కాకుండా సీఎం జగన్ నిన్న ప్రధాని మోదీతో.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ వంటి మంత్రులతో భేటీ అయ్యారు. ఆ వివరాలను కూడా జగన్ గవర్నర్‌తో పంచుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: