పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇవాళ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ వివాహమాడనున్నారు. కౌర్‌ మౌలానా వైద్య కళాశాల నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. చంఢీగఢ్ సెక్టార్ 8 లోని ఓ గురుద్వారాలో అత్యంత నిరాడంబరంగా, అతికొద్ది సన్నిహితుల మధ్య పంజాబ్‌ సీఎం మాన్ పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారు.

భగవంత్ మాన్ కు ఇంతకుముందే పెళ్లయింది.. ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆరేళ్ల క్రితం పంజాబ్‌ సీఎం మాన్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. మాన్‌ నుంచి విడాకులు పొందిన ఆమె తన ఇద్దరు పిల్లలతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌ సీఎం మాన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: