తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలపై అప్పుడే జోస్యం చెబుతున్నారు. వచ్చే సంవత్సరం జూన్ , జులై లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందంటున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై దుష్పచారం చేస్తే వారి పై  చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 365 రోజుల తర్వాత సోనియా గాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెపితే వారిని పల్లకిలో మోసికెల్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామంటున్నారు. తన  లక్కీ నెంబర్ 9 అని.. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని ప్రజలని కోరుతున్నానని ముందే చెప్పేస్తున్నారు.

బండి సంజయ్ ఆర్టీఐ ద్వారా సచివాలయానికి కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారో చెప్పండని  అడుగుతున్నారని.. కానీ.. అసలు సచివాలయమే లేదు కదా అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ దే విజయం అంటూ రేవంత్ రెడ్డి దీమా ప్రదర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: