ఈనెల 11,12 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటించనున్నారు.  వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్నారు. భారత ప్రధాని  ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు నిర్ణయించింది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.


ప్రధాని నరేంద్ర మోడీ కి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విషయమై విపులంగా వివరించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన  విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ క్యాడర్ దీనిని బృహత్తర కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో  ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కోసం, వైసీపీ పోరాటం చేసింది. ఇన్నాళ్లకు ఆ కల సాకారమైంది. దీన్ని ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. 12.68 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాను ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: