గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం ఇటీవల బాగా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రహదారి విస్తరణ పేరుతో గ్రామంలో చాలా ఇళ్లను అధికారులు కూలగొట్టారు. అంతే కాదు.. గ్రామంలోని గాంధీ, నెహ్రూ వంటి వారి విగ్రహాలు కూడా తొలగించారు. అయితే.. మొదట్లో వైఎస్‌ విగ్రహాన్ని మాత్రం తొలగించలేదు.

అయితే.. ఇళ్ల కూల్చివేతపై గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్... రోడ్డు మీద ఉన్న వైయస్ విగ్రహాలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ముళ్ల కంచెల ద్వారా విగ్రహానికి పోలీసు బందోబస్తు నిర్వహించడంపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఇప్పుడు వైఎస్ విగ్రహం కూడా తొలగించారు. రోడ్డు విస్తరణలో భాగంగా  వైఎస్ విగ్రహాన్ని  క్రేన్ సాయంతో తొలగించి పక్కకు పెట్టారు. అయితే.. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న మరో విగ్రహాన్ని తొలగించలేదని కొందరు గ్రామస్థులు  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR