సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు కేంద్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ సంయుక్త కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది కారణంగా మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ సర్వే పనులు త్వరగా, మెరుగ్గా చేసుకోవటానికి వీలు కలిగిందని అలోక్ ప్రేమ్ అభిప్రాయపడ్డారు. గ్రామసభలతో మొదలై హక్కు పత్రాలు ఇచ్చే వరకూ రీసర్వే ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయనకు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. వెబ్ ల్యాండ్ తరహాలో ప్రత్యేక పోర్టల్ ను దీని కోసం రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు కేంద్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ సంయుక్త కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది కారణంగా మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ సర్వే పనులు త్వరగా, మెరుగ్గా చేసుకోవటానికి వీలు కలిగిందని అలోక్ ప్రేమ్ అభిప్రాయపడ్డారు. గ్రామసభలతో మొదలై హక్కు పత్రాలు ఇచ్చే వరకూ రీసర్వే ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయనకు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. వెబ్ ల్యాండ్ తరహాలో ప్రత్యేక పోర్టల్ ను దీని కోసం రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.