అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సీఎం జగన్‌ కోరుకుంటున్నారు. నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్‌మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మేరీ క్రిస్మస్‌ తెలియజేస్తున్నానని జగన్ అన్నారు.

జగన్ ఏమన్నారంటే.."కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని అడిగా. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్‌ గురించి చెప్పాలంటే నా కంటే ఇక్కడ ఉన్న వారు చక్కగా చెబుతారు. మనం నేర్చుకోదగ్గ పాఠం ఒక్కటే. మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడనేదే. మన నుంచి దేవుడు కోరుకునేది ఒకటే. అధికారంలో ఉన్నవాళ్లు ఇంకా ఒదగాలి. సేవలకులమని గుర్తు పెట్టుకోవాలి. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం నాకు ఇవ్వాలి. ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలి. ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: