నరసాపురం వైసీపీ వివాదాస్పద ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెరుకువాడ రంగనాథ రాజును టార్గెట్గా చేసుకున్న ఆయన వారిద్దరు తనపై కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. రఘురామ సుబ్బారెడ్డి పేరును సీఎం బాబాయ్ అంటూ పరోక్షంగా టార్గెట్ చేశారు. తాడేపల్లి పెద్దలే తనను టార్గెట్ చేస్తూ ఒకేసారి ఏకంగా పదికి పైగా కేసులు పెట్టించారని ఆయన విమర్శించారు.
తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై సభాపతికి ఫిర్యాదు చేశానని... వారికి ప్రివిలైజ్ నోటీసులు పంపిస్తామని చెప్పారు. ఒక కులానికి అనుకూలంగా మాట్లాడిన ఏయూ వీసీని తొలగించాలని కూడా గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఎంపీగా తనుకు ఉన్న హక్కులు కాలరాయడానికి
టీటీడీ చైర్మన్ ఎవరని కూడా ప్రశ్నంచారు.