క‌రోనా కార‌ణంగా చాలా రోజుల త‌ర్వాత తెర‌చుకున్న తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం శ్రీవారిని రికార్డు స్థాయిలో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 53,435 మంది భక్తులు రికార్డు స్థాయిలో త‌లానీలాలు స‌మ‌ర్పించుకోవ‌డంతో పాటు వీరు వేసిన కానుక‌ల వ‌ల్ల రికార్డు స్థాయిలో స్వామికి ఆదాయం ల‌భించింది.

26,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.76 కోట్లు. అలిపిరి వద్ద రేపటికి సర్వదర్శనం టోకెన్లు జారీ. రేపటి నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. ఏదేమైనా క‌రోనా త‌ర్వాత భ‌క్తులు భారీగా స్వామిని ద‌ర్శించుకుంటున్నారు. దేశ‌వ్యాప్తంగా శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీ స్థాయిలో త‌ర‌లి వ‌స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: