ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అరటిపండు ఒలిచి కొని తిన్నంత ఈజీగా ఎంతోమంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలకే  జీవితం అయిపోయిందని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా తరచూ ఎక్కడో ఓ చోట ఆత్మహత్యలకు పాల్పడటం  కుటుంబాలను విషాదంలోకి నెట్టడం లాంటి సంఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. కొన్నికొన్ని సందర్భాల్లో అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి వస్తుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది నవవధువు. కానీ మూడు నెలలకే చివరికి ఆత్మహత్య చేసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇక ఈ ఘటనలో మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీప గ్రామానికి చెందిన పుష్పరాజ్ కు దీప అనే 25 ఏళ్ల యువతితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తమ కూతురు ఎంతో ఆనందంగా ఉంది అని తల్లిదండ్రులు భావించారు.


 కానీ ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది సదరు నవవధువు. ఈ క్రమంలోనే దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన వేలు స్వామి అనే 35 ఏళ్ల వ్యక్తి తో వివాహానికి ముందే ఆ యువతి పరిచయమైంది. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది.  కాగా పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని తల్లిదండ్రులకు దీప చెబుతూ ఉండేది. కానీ బంధువులు మాత్రం బలవంతంగా ఒప్పించి వివాహం చేశారు  ఈ క్రమంలోనే మనోవేదనతో చివరకు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: