
ఈ పరిణామం బీజేపీలో అంతర్గత ఉద్రిక్తతలను సూచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో అంచనాలు రావడం గమనార్హం. పార్టీ కమిటీ ఇప్పటికే ఆరుగురు అభ్యర్థుల పేర్లను చర్చలోకి తెచ్చింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తి రెడ్డి వంటి పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. అయితే అర్వింద్ ప్రతిపాదన ఈ లిస్టును ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ స్థానం బీజేపీకి ప్రతిష్టాత్మకమని, దీని ద్వారా పార్టీ బలాన్ని పరీక్షిస్తామని నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై దృష్టి పెట్టి, బీసీ అభ్యర్థిని బలపరచడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదన అర్వింద్ వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ఏబీవీపీలో ఆయన చురుకైన పాత్ర పార్టీకి బలమైన మద్దతును అందించగలదని అర్వింద్ భావిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం శుక్రవారం ఈ పేర్లలో ఒకరిని ఫైనల్ చేస్తుందని సమాచారం.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు