రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.కొన్ని దురుద్దేశపూర్వక శక్తులు ఈ ప్రాజెక్టుకు భూములు కేటాయించకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం.. భూసేకరణ ప్రక్రియను అడ్డుకోవడానికి వివిధ మార్గాలు అనుసరిస్తున్నాయి. రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ భూములు తమకు ఇస్తే ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ఆశ చూపిస్తున్నాయి. మిగిలిన రైతులను కూడా గూగుల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలు రాష్ట్ర అభివృద్ధిని ఆలస్యం చేసేలా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
ఇలాంటి దుష్టశక్తులు గతంలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.కొంతమంది రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చనిపోయిన రైతు పేరును కూడా ఉపయోగించి ఈ పిటిషన్ వేశారు. గూగుల్ ప్రాజెక్టుకు భూములు కేటాయించకూడదని ఆ పిటిషన్లో వాదిస్తున్నారు. ఈ చర్యలు స్పష్టంగా కుట్రలో భాగమే అని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఈ ఫోర్జరీలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి అక్రమాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. రైతులు ఈ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వానికి సహకరించాలి.స్థానిక తహసీల్దార్ ఈ నెల 3న ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా తాజాగా కేసు నమోదు చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి