సీజన్ ఏదైనా సరే బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మగవలు. ముఖ్యంగా అతివలకి ఇష్టమైన లోహాలలో బంగారం అత్యంత ప్రీతికరమైనది. ఒకరిని చూసి ఇంకొకరు కొనుగోలు చేయాలని ఆశా తపన వారిలో ఎప్పుడూ ఎక్కువ అవుతూనే ఉంటుంది. అందుకే బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు లక్ష రూపాయల వరకు పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ రూ.98 వేలకు వచ్చి చేరింది. ఇక ఈ విషయంలోనే బంగారం ఒక్కోసారి ధర పెరుగుతూ.. ఒక్కోసారి ధర తగ్గుతూ ఉన్న కారణంగా అటు కొనుగోలుదారులు కూడా అయోమయంలో పడ్డారు.

ఇకపోతే వ్యాపారస్తులేమో రూ.80 వేల నుండి రూ.85 వేల మధ్యలో వుంటే  అటు కొనుగోలుదారులకు ఇటు అమ్మకపుదారులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక మొన్నటి వరకు బంగారం పెరుగుతుంది కాబట్టి ముందుగానే బంగారం కొనుగోలు చేస్తే బెటర్ అని,  చాలామంది అనుకున్నా.. అందులో భాగంగానే రూ.85వేలు, రూ.90 వేలు, రూ.95 వేల వరకు ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఇక తర్వాత బంగారం విలువ లక్ష రూపాయలు,  రూ. 1,02,000 గా  పెరిగినప్పుడు.. హమ్మయ్య మనం కొన్న బంగారానికి మార్కెట్ పెరిగింది అని సంతోషపడ్డారు. అంతలోనే బంగారం  ధరలు సడన్ గా రూ.98 వేలకు పడిపోవడంతో అటు బంగారం ఎక్కువగా కొనుగోలు చేసిన వారు కూడా కాస్త అయోమయంలో పడ్డారు.

బంగారం ఒక్కోసారి పెరుగుతూ..  ఒక్కోసారి తగ్గుతూ ఉండడం వల్ల అటు కొనుగోలుదారులు కూడా అయోమయంలో పడుతున్నారు. ఇక ఇలాగే ఉంటే బంగారం ధరలు పెరగవచ్చు. అయితే అది ఎంతవరకు పెరుగుతుంది రూ.1,25,000 వరకు వెళ్తుందా..? లేక తగ్గితే మళ్ళీ రూ.80,000 వరకు వస్తుందా అన్నది తెలియని పరిస్థితి. ఏది ఏమైనా అంతర్జాతీయంగా మాఫియా తగ్గితే తప్ప బంగారం ధరలు తగ్గవని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో బంగారం కొనాలా వద్దా అని కొనుగోలుదారులు లేదా అమ్మకపు దారులు పూర్తిస్థాయిలో అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: