మటన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. మటన్ తో గోంగూర కలిపి వండితే మరింత రుచిగా ఉంటుంది. ఈ కర్రీ తయారీ విధానం చాలా సింపుల్. మరి ఈ మటన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావలసిన విధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మటన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీన్ని కుక్కర్ లోకి తీసుకుని ఇందులో కొద్దిగా నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి కనీసం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ లోపు మరో పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక ...ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఇవి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కాసేపు వేయించి..ఆ తరువాత గోంగూర వేసి అంతా కలిపి మీడియం మంట మీద మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గోంగూర బాగా వేగాక... వేడి చల్లారిన మటన్ కూడా వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికిందో లేదో చూసి..కావాలంటే కొద్దిగా నీళ్లు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. దించే ముందు గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి కాసేపు ఉడకనిచ్చి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ సిద్ధం. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదుర్స్. ఈ చలికాలంలో ఈ కూర తినటం ఆరోగ్యానికి కూడా మంచిది.