బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అంటే తెలియని వారు ఉండరు.  ఎప్పుడూ ఎదో ఒక వివాదాంలో హల్ చల్ చేసే రాఖీ సావంత్ ఆ మద్య ‘మీ టూ ’ ఉద్యమంపై కూడా తనదైన శైలిలిలో వ్యంగంగా స్పందించింది.  తాజాగా సీడబ్ల్యుఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళా రెజ్లర్ రోబెల్ చేసిన ఛాలెంజ్ స్వీకరించిన నటి రాఖీసావంత్ గాయాల పాలైంది.  మహిళా రెజ్లర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆమె చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలైంది.  


రింగ్‌లోకి దిగిన రాఖీ సావంత్‌ను హిళా రెజ్లర్ రోబెల్ రింగ్‌లోకి దిగిన రాఖీ సావంత్‌ను తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో రాఖీకి దిమ్మతిరిగి మైండ్ బ్లోయింగ్ అయ్యింది..అంతే కాదు 8 నిముషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయింది.  వివరాల్లోకి వెళ్తే.. ఛండీగఢ్‌లోని పంచకుల సమీపంలో ఉన్న తావూదేవి లాల్ స్టేడియంలో గ్రేట్ కాలి ఆధ్వర్యంలో కుస్తీ పోటీ జరిగింది. పంచకులలో తనతో తలపడే సత్తా ఉన్న ఎవరైనా ముందుకు రావచ్చని రోబెల్ ఛాలెంజ్ విసరగా, రాఖీ సావంత్ ‘సై’ అంది.

Related image

అంతే కాదు రింగ్‌లోకి దూసి తనతో పాటు డ్యాన్స్ చేయాలని సవాల్ విసిరింది. వెంటనే రాఖీతో సమానంగా డ్యాన్స్ చేసిన మహిళా రెజ్లర్ అది పూర్తవ్వగానే ఆమెను అమాంతం పైకి లేపి నేలకేసి కొట్టింది. అయితే అక్కడున్న ప్రేక్షకులు రాఖీ సీడబ్ల్యుఈ ఛాపింయన్‌షిప్ కార్యకర్త అనుకుని లైట్‌గా తీసుకున్నారు. అయితే గేమ్ నిర్వాహకులు రాఖీ బాధపడుతుండటాన్ని గ్రహించి వెంటనే ఆమెను రింగ్ నుంచి బయటకు తీసుకువచ్చి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాఖీ, జీరఖ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: