టాలీవుడ్ లో మ్యూజిక్ డైరక్టర్ల కొరత చాలా ఉంది.. ప్రస్తుతం ఉన్న ఇద్దరు యూత్ మ్యూజిక్ డైరక్టర్స్ మాత్రమే అన్ని సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నరు మరి టాలీవుడ్ దర్శక నిర్మాతలు వారిని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు. బిగ్ సినిమా మ్యూజిక్ డైరక్టర్ అంటే అయితే దేవి కాకపోతే థమన్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది. మ్యూజిక్ సినిమాను దాదాపు రిలీజ్ కి ముందు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళే ఒక మంత్రం.. ఆడియో రిలీజ్ తో ఏ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా చేసే ఈ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్..టాలీవుడ్ లో ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్స్ మాత్రమే తమ హవా కొనసాగిస్తున్నారు.. దేవి సినిమాతో పరిచయమై సూపర్ క్రేజీ మ్యూజిక్ ఇస్తూ మ్యూజిక్ ప్రియులను అలరిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఒకరైతే.. తన రాకింగ్ మ్యూజిక్ తో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న థమన్ ఒకడు. ప్రస్తుతం ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే దానికి కచ్చితంగా అయితే దేవి అయినా అయి ఉంటున్నాడు లేదా థమన్ అయినా మ్యూజిక్ డైరక్టర్ అయ్యి ఉంటున్నాడు. మరి తెలుగు డైరక్టర్స్ కి , ప్రొడ్యూసర్స్ కి వేరే ఆఫ్షన్ లేదా అంటే లేదనే తలాడించాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు సీనియర్ మ్యూజిక్ డైరక్టర్స్ అంతా రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మంచి ఫాం మీద ఉన్నది వీరే కాబట్టి వీరిద్దరినే సెలెక్ట్ చేసుకుటున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న వీరిద్దరు సినిమా సినిమాకి మంచి మ్యూజిక్ అందిస్తుండడంతో మరళ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి దేవి, థమన్ ల మ్యూజిక్ డైరక్టర్స్ గా పేర్లు వినపడుతున్నాయి. అంటే వారు ఎంత క్రేజీనో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు కూడా అయితే దేవిని, లేదా థమన్ ని పెట్టి చేద్దం అనే ఆలోచనలో ఉన్నారు. వారు కూడా వచ్చిన అవకాశన్ని ఎంతో కాన్సెంట్రేట్ చేసి ఆడియో పరంగా సూపర్ హిట్ట్ అయ్యేల కష్ట పడి మరి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే ఒక సినిమా థమన్ చేస్తే మరో సినిమ దేవి చేసుకుంటూ వచ్చాడు. ఈ ఫాం ఇలానే కొనసగించేలా నెక్ష్ట్ ఇయర్ కూడా వీరి చేతిలో బిగ్ ప్రోజెక్ట్స్ ఉన్నాయి. ఈ కోవలోనే ప్రస్తుతం తెలుగు సినిమాకు వీరు మాత్రమే దిక్కు అనే పరిస్థితి నెలకుంది. మహేష్ దూకుడు ఆఫర్ కొట్టేసిన థమన్ ఆ సినిమాలో తన విశ్వ రూపం చూపించి తనని మళ్లీ ఇంకో సినిమాకు బుక్ చేసుకునేలా చేశాడు. ఆ తర్వాత రెండు సినిమాలు వేరే మ్యూజిక్ డైరక్టర్ తో తీసిన మహేష్ మళ్లీ బిజినెస్ మ్యాన్ తో థమన్ తో జతకట్టాడు.ఇదె బాటలో థమన్ జపం చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. బృందావనం కి కలిసి పనిచేసిన ఎన్.టి.ఆర్ , థమన్.. ఇప్పుడు వరుస సినిమాలన్నీ తానే మ్యూజిక్ డైరక్టర్ గా చేస్తున్నాడు. బాద్షా తో కలిసిన వీరు మరళ రామయ్యా వస్తావయ్య కూడా ఎన్.టి,ఆర్ థమన్ ని మ్యూజిక్ డైరక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. అంతేకాదు రాబోయే రభస కి కూడా థమన్ నే మ్యూజిక్ గా తీసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇక దేవి విషాయానికొస్తే ప్రస్తుతం మహేష్ తో వన్ సినిమా చేస్తున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ తో మహేష్ ని రాక్ స్టార్ చేసేశాడు దేవి శ్రీ ప్రసాద్. పవర్ స్టార్ దేవి కాంబినేషన్ సూపర్ హిట్.. జల్సా సినిమా నుండి అత్తరింటికి దారేది వరకు పవన్ కళ్యాణ్ ,దేవి ది క్రేజీ కాంబినేషన్. ప్రస్తుతం పవర్ స్టార్ కి దేవి మాత్రమే సోలో మ్యూజిక్ డైరక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే వారిద్దరి రాపో బాగా కుదురుతుందని ఇరువురి అభిప్రాయం. అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవ్వడానికి దేవి మ్యూజిక్ కూడా కారణమంటే కాదని చెప్పలేం సో అందుకే పవన్ కళ్యాన్ దేవి నే తన నెక్ష్ట్ సినిమాకు కూడా మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకోబోతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: