సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగతుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ వేడుకకు వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇటు సూపర్ స్టార్ మహేశ్...అటు...మెగాస్టార్ చిరంజీవి అగ్ర హీరోలు ఇద్దరూ ఒకే వేదికను షేర్ చేసుకుంటుండటంతో ఎల్బీ స్టేడియానికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ క్యూ కట్టారు. తమ అభిమాన హీరోలను ఒకే దగ్గర చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

 

ఈ ఈవెంట్‌లో పాట‌ల ర‌చ‌యిత‌ రామ‌జోగయ్య‌.శాస్ట్రి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రోగ్రాం చేసేందుకు ఇంత అద్భుత‌మైన ఏర్పాట్లు చేసిన ప్రొడ్యూస‌ర్లు అనిల్‌గారికి రాజుగారికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ఈ టైటిల్‌కి ఒక సంచ‌ల‌నం ఏర్ప‌టింది. ఇలాంటి ఒక టైటిల్ మ‌హేష్‌ మీద పెట్టాల‌న్న ఆలోచ‌న  రావ‌డం అనేది చాలా గ్రేట్‌. అనీల్‌కి అభినందించాను. బ్ర‌హ్మాండ‌మైన ఎమోష‌న్  బ్యాక్‌డ్రాప్ ప్ర‌కాష్‌రాజ్‌, విజ‌య‌శాంతి తీసుకురావ‌డం చాలా థ్యాంక్స్‌, మంచిక‌థ ప్ల‌స్ అనిల్‌రావిపూడి అన్నిటిని మేళ‌వించి జ‌న‌వ‌రి 11న విడుద‌ల కావ‌డం విశేషం. నేను రాసిన‌ రెండు పాట‌లు సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యాయి. సినిమాలో కీల‌క‌మైన స‌న్నివేశం  గురించి ఒక‌పాట‌ను రాశాను. ఆ పాట ట్విట్ట‌ర్‌, సోష‌ల్‌మీడియాలో చాలా లైక్స్ వ‌చ్చాయి సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యాయి. 


నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరగుతున్న‌ 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి జనం పోటెత్తడం ఖాయం. ఈ మేరకు వాహనదారులు, ప్రజలపై పోలీసులు ఆంక్షలను విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విజయ శాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత విజయ శాంతి మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: