టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ,బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టాడు. తెలుగు సూపర్ హిట్ మూవీ  జెర్సీ హిందీ రీమేక్ ద్వారా దిల్ రాజు, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అల్లు అరవింద్, అమన్ గిల్ లతో కలిసి దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈరీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.  
 
ఇక ఇప్పడు దిల్ రాజు మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. రీసెంట్ తెలుగు సూపర్ హిట్.. హిట్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈరీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా నటించనుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈరీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈవిషయాన్ని శైలేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. తెలుగు హిట్ ను నాని నిర్మించగా హిందీ వెర్షన్ ను కుల్దీప్ రాథోర్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నాడు. మొత్తానికి అలా రెండు తెలుగు సూపర్ హిట్ సినిమాల రీమేక్ లతో దిల్ రాజు, బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: