స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత పెళ్లి తర్వాత కూడా మంచి విజయాలతో మంచి ఫామ్ లో ఉంది ఈ భామ. అయితే ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విదితమే. అయితే ఆమె చివరిగా నటించిన 'ఓ బేబీ' సినిమా తరువాత సమంతకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పాలి మరి.


అంతేకాదు సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో మాత్రం సంచలనమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. తరచు ఫిట్నెస్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంది. ఇక ఇంటివద్ద ఉంటూనే సమంత కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు కూడా వింటుందని సమాచారం. అయితే ప్రస్తుతం దర్శక నిర్మాతలతో స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయని సమాచారం.


అయితే సమంతతో ఓ బ్లాక్ బస్టర్ రూపొందించిన ఓ ప్రొడక్షన్ హౌస్ ఓ స్క్రిప్ట్ తో ఆమెను సంప్రదించారట. ఇక ఆ స్క్రిప్ట్ సమంతకు నచ్చడంతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ సినిమాకోసం సమంత 3.5 కోట్ల పారితోషికం అడిగిందని సమాచారం. ఇక ఆమె అంత భారీ మొత్తం అడగటంతో నిర్మాత షాక్ గురైయ్యారంట. సమంతకు అంత ముట్టజెప్పే బదులు వేరే హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారట ప్రొడ్యూసర్.


ఇక సోనీ పిక్చర్స్ నిర్మించనున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై సంతకం చేసింది సమంత. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే విజయ్ సేతుపతి నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ సినిమా కూడా చేస్తున్నారు. ఇవేగాక సమంత "ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2" వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను సిద్ధం చేసుకునే పనిలో ఉంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: