దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్స్ ప్రారంభించారు. అయితే ఇప్పుడు యువ హీరోల చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా నిఖిల్ కూడా వారి జాబితాలో చేరాడు. ఇక అర్జున్ సురవరం' సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. నిఖిల్ హిట్ సినిమా కార్తికేయ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 చిత్రంలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. దీంతో పాటు నిఖిల్ 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నారు.

అయితే నిఖిల్ తన కెరీర్లో 20వ ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్, పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నారు. అయితే ఇప్పుడు కార్తికేయ 2, 18 పేజెస్' రెండు సినిమాలలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భామ అ ఆ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అనంతరం  'ప్రేమమ్' 'శతమానం భవతి' 'ఉన్నది ఒకటే జిందగీ' 'కృష్ణార్జున యుద్ధం' 'హలో గురూ ప్రేమ కోసమే' 'రాక్షసుడు' వంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది.

ఇక ఇప్పుడు నిఖిల్ సిద్దార్థ్ నటించే 'కార్తికేయ2, 18 పేజెస్' సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. చందు మొండేటితో 'ప్రేమమ్' సినిమా చేసిన ఈ బ్యూటీ. ఆ పరిచయంతో 'కార్తికేయ 2' లో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఇప్పుడు '18 పేజెస్' లో కూడా అనుపమనే హీరోయిన్ గా తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: