టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ యాంకర్స్ - 2020 జాబితాలో ఉన్న బుల్లితెర యాంకర్స్ వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. ప్రతి నిత్యం బుల్లితెరపై మనల్ని ఎంతగానో అలరిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వస్తున్నారు మన బుల్లితెర యాంకర్స్. మరి బుల్లితెర పై ప్రజలు బాగా ఇష్టపడే తారల జాబితాలో టాప్ - 10 తారలు ఎవరు అనే వివరాలు ఒకసారి చూద్దామా. బిగ్ బాస్ షో ద్వారా అనేక మంది అభిమానులని సొంతం చేసుకున్నది దివి వధ్య.


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఉత్కంఠ రేపిన నటి దివి. అటు టీవీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో సైతం భారీగా అభిమానులను పెంచుకుంటోంది. అందుకే 2020 మోస్ట్ డిజైరబుల్ జాబితాలో నంబర్ వన్ బ్యూటీగా రికార్డు కెక్కింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఇకపోతే యాంకర్ విష్ణుప్రియ భీమినేని గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల బుల్లితెర హోస్ట్ గా రాణిస్తూ అప్పుడప్పుడు ఫోటోషూట్లతో కుర్రకారులో హీట్ పెంచుతోంది. తన నటనతో, గ్లామర్ తో  విష్ణుప్రియ తెలుగు టెలివిజన్ రంగంలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అందుకే 2020 మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ 2లో నిలిచింది.

అలాగే తరువాత స్థానం యాంకర్ శ్రీముఖి దక్కించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో శ్రీముఖి ఫైనల్ వరకూ వెళ్లి తన సత్తా ఏంటో చూపించింది. అలాగే చాలా షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. అందుకే  మోస్ట్ డిజైరబుల్ జాబితాలో మూడవ ప్లేస్ లో ఉంది. ఇంకా ఈ లిస్ట్ లో తరువాత స్థానంలో ఉన్న  యాంకర్ రష్మి గౌతమ్. ఈ పేరుకి ఎంత పాపులారిటీ ఉందో మీకు బాగా తెలుసు. ఎక్సట్రా జబర్దస్త్, ఢీ షో లకు హోస్ట్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
 

నటుడు సుధీర్ అలాగే రష్మీ ల కెమిస్ట్రీ బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయినది.దీనితో అటు టీవీ రంగంతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం  ఫాలోయింగ్ ను పెంచుకుంది. కాగా రష్మి ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. అలాగే వర్షిని సౌందరాజన్.. యూత్ లో ఒక ఊపు తెచ్చిన యాంకర్. టీవీలో పలు ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేస్తుంది., ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. టీవీ పరిశ్రమలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. అలాగే ఈ మధ్య జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయినది వర్ష.. ఈ బ్యూటీ లేటెస్ట్ గా మోస్ట్ డిజైరబుల్ జాబితాలో అడుగుపెట్టింది. జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటిస్తుంది. వర్ష ఇప్పుడు ఆరవ స్థానంలో ఉంది.

వింధ్య విశాఖ.. స్పోర్ట్స్ ప్రెజెంటర్-టర్న్డ్-టీవీ హోస్ట్.. లాక్ డౌన్ సమయంలో స్క్రీన్ పైనా.. ఆఫ్ ది స్క్రీన్ లో కొన్ని అసాధారణ వ్యవహారాలతో పాపులరయ్యారు వింధ్య. అయితే ఆమె డిజైరబుల్ జాబితాలో ఇప్పుడు ఏడవ స్థానానికి పడిపోయింది. ఆమె 2019 జాబితాలో రెండవ స్థానంలో ఉంది. అలాగే 8 వ స్థానంలో అశ్విని ఉంది. నాగ భైరవి  సీరియల్ ద్వారా పరిచయం అయిన అశ్విని అంతకముందు స్వాతి చినుకులు అనే సీరియల్ లో నటించింది. ఇప్పుడు థ్రిల్లర్ సీరియల్ లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.


అశ్విని కన్నడ టీవీ షోలతో అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు వారిని కూడా అలరిస్తుంది. ఇకపోతే దీప్తి మన్నే 9 వ స్థానంలో ఉంది. జీ తెలుగులో ప్రసారమయ్యే `రాధమ్మ కుతురు`లో ఆమె నటన యూత్ కి బాగా కనెక్టయ్యింది. అంతేకాకుండా కళలు, ట్రావెలింగ్, తత్వశాస్త్రం టాపిక్ లతో సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు సమీరా షెరీఫ్ పదవ స్థానంలో ఉంది. ఒకప్పుడు టీవీ సీరియల్స్ చేస్తూ అందరిని అలరించినది సమీరా.తరువాత జీ తెలుగులో ప్రసారమైన `అదిరింది`లో తన యాంకరింగ్ తో అందరిని మైమరిపించింది. ప్రస్తుతం ఇప్పుడు గర్భిణి. టీవీ షో లకు దూరంగా ఉన్న మాతృత్వంపై ఆమె ఆన్ లైన్ లో అభిమానులకు రకరకాల విషయాలు చెప్తు వస్తుంది. సమీరా ఈ లిస్ట్ లో పదవ స్థానాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: