ఒకప్పుడు బుల్లితెరలో ఢీ, వన్స్ మోర్ ప్లీజ్ వంటి పలు షోల తో పాపులర్ అయిన ఉదయభాను ఇప్పుడు తిరిగి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో మైకు పట్టి గలగల మాట్లాడిన ఈ యాంకర్ ఇప్పుడు కెమెరా ముందు యాక్టింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ఈమె సీరియల్స్ లో నటించబోతున్నారు అన్న వార్త ప్రచారమౌతోంది. ఒకప్పుడు యాంకర్ గా ఉన్న ప్రశాంతి సైతం ప్రస్తుతం సీరియల్స్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే తరహాలో ఉదయభాను కూడా ఓ ప్రముఖ ధారావాహికలో కనిపించబోతున్నారు అంటూ వార్త వినిపిస్తోంది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏదో ఒకటి ఉదయభాను తెరపై కనిపిస్తే చాలు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒకప్పుడు ఉదయ భాను కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉదయభాను బుల్లితెర అందాల యాంకర్. అందం, అభినయం ఆమె సొంతం. ఒకప్పుడు యాంకరింగ్ సామ్రాజ్యంలో తనదైన శైలిలో  అందరినీ ఆకట్టుకుని మహారాణిగా  కొనసాగిన వ్యాఖ్యాత. ఈ అచ్చ తెలుగమ్మాయి 10 వ తరగతి చదువుతుండగా ఇండస్ట్రీకి వచ్చింది.  యాంకరింగ్ అనే  మాటకు అర్థం తెలియని వయసులోనే హృదయాంజలి అనే షో కోసం మైకు పట్టి ప్రజలతో గలగల మాట్లాడుతూ అందరినీ అలరించింది. ఆ తరువాత వన్స్ మోర్ ప్లీజ్,
సాహసం చేయరా డింభకా,  రేలారే రే రేలా, డాన్స్ బేబీ డాన్స్ రియాలిటీ డాన్స్ షో, పిల్లలు పిడుగులు, జానవులే నెరజాణవులే వంటి షోలతో తెలుగు ప్రేక్షకులను తన యాంకరింగ్ తో మంత్ర ముగ్ధుల్ని చేసింది. బుల్లితెరపై హాట్ గా కనిపించిన మొదటి యాంకర్ గా కూడా ఈమె కావడం విశేషం.


ఇటు బుల్లితెరను పరిపాలిస్తూనే అటు వెండి తెరపై కూడా అడుగుపెట్టింది భాను.  లీడర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి మురిపించింది. ఆ తర్వాత కూడా అడపా దడపా సినిమాలు చేసింది. ఇలా ఎంతో బిజీ గా కెరియర్ సాగుతున్న రోజుల్లోనే   యాంకరింగ్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చేసింది ఈ భామ. తనకు కవల పిల్లలు పుట్టడంతో వారి ఆలనాపాలన కోసం కెమెరాకు దూరమయ్యింది. ఇటీవలే ఈటీవీ ప్లస్ లో లీడర్స్ షో లో కనిపించింది కానీ ఆ షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా కెమెరా ముందుకు  వచ్చేందుకు సిద్దమయిందట భాను. ఈమె సీరియల్స్ లో నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: