సినిమా పరిశ్రమలో ఒక భాషకు చెందిన నటులు మరో భాషలోకి వెళ్లి నటించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు తెలుగులో నటించి పాపులర్ అవ్వడం చూశాము. కానీ తెలుగు నుండి తమిళ్ లోకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు హీరోలు సైతం తమిళ్ డైరెక్టర్ లతో కలిసి సినిమాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తూ ఉన్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తో కలిసి తన కెరీర్ లో 15 వ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉంది.

ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎన్నో కలలు కంటున్నారు. సెన్సేషనల్ కాంబో కావడం చేత, ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే స్టోరీ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు madhav BURRA' target='_blank' title='సాయి మాధవ్ బుర్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సాయి మాధవ్ బుర్రా కథను మాటలు అందిస్తున్నాడు. దీనితో శంకర్ కథను ఈయనకు వివరించాడు. దీనితో ఆ కథ సాయి మాధవ్ వల్లనే లీక్ అయిందని విమర్శలు వస్తున్నాయి. లీక్ అయిన దానిని బట్టి ఈ కథ "ఒక ఐఏఎస్ అధికారి కొన్ని పరిస్థితుల కారణంగా సీఎం తో గొడవ పెట్టుకుని, సీఎం అవుతాడని తెలుస్తోంది". మాములుగా ఒక కథ విషయంలో సినిమా బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసిందే. అలాంటిది కథ లీక్ అవ్వడంతో డైరెక్టర్ శంకర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఇక కథ తెలిసిపోతే ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యే అవకాశమే లేదు.

అందుకే కథలో కీలక మార్పులు చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. అందుకే సినిమా షూటింగ్ కూడా లేట్ అవుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, కథ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడు. మొత్తం కథ సిద్దమయ్యాకే షూటింగ్ మొదలెడతాడు. మరి ఈ విషయంలో నిర్మాతల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: