మరోవైపు సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీలైనంత త్వరగా దానిని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రానా మరొక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ వారి భవదీయుడు భగత్ సింగ్ అలానే, సురేందర్ రెడ్డి తీయనున్న మరొక సినిమాలో కూడా పవన్ నటించనున్నారు. వీటిలో హరీష్ శంకర్ సినిమా అతి త్వరలో పట్టాలెక్కనుండగా సురేందర్ రెడ్డి మూవీ మరొక రెండు నెలల అనంతరం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి తీయనున్న మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు టాక్.
యువ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ర్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతుండగా ఈ మూవీలో ఒక కీలక రోల్ కోసం కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ మూవీలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డిని తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆమెను కలిసి కథ కథనాలు వినిపించనున్నారని, ఆమె కనుక చేయడానికి ఒప్పుకుంటే ఇదే ఆమెకు చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కం బ్యాక్ మూవీ అవుతుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలి అంటే దీనిపై మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.