దేవా కట్టా లాంటి దర్శకుడు తీసిన ` రిప‌బ్లిక్ ` చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో మెగా హిరో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులు ఉన్నారు. సాధార‌ణంగా దేవా కట్టా లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు హై లెవ‌ల్ లో ఉంటాయి. `రిపబ్లిక్` చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ లు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో సినిమా రిలీజ్ స‌మ‌యం దగ్గరపడుతుండటంతో సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం జ‌రిగింది. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. హీరో ఆస్ప‌త్రిలో ఉన్నా కూడా.. సాయిధ‌ర‌మ్ తేజ్‌ కోరిక, సంకల్పం మేరకు `రిప‌బ్లిక్ ` సినిమాను నేడు ( అక్టోబర్ 1 ) న విడుదల చేస్తున్నారు.


    అయితే,  ఇండస్ట్రీలోని కొంద‌రు న‌టుల‌కు ఈ సినిమాను ముందుగానే చూపించారు. వాళ్లంతా కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్‌ నటనకు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ఇప్పటికే  ప్రివ్యూలు కూడా వేశారు కొన్ని చోట్ల.  ఈ సినిమాను నెటిజన్లు కూడా చూసిన‌ట్టున్నారు. దీంతో సినిమా చూసిన వీక్ష‌కులు కూడా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు.


   నువ్వు ఈ  సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టింలోంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. అలాగే తేజూ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు, అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. దేవా కట్టా విజన్‌ను మెగా హీరో తేజ్ ద్వారా మ‌న ముందుకు తీసుకువ‌చ్చారు.. దీనిద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే లాగా చేశార‌ని, ప్రస్తుతం మన సమాజంలోనే ఉన్న‌ కొన్ని సమస్యలను ఈ సినిమాలో చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చాడు ఓ నెటిజన్.



      ఫుల్ సీరియస్ మూవీ అంటూ కొందరు.. మొదటి సీన్ నుంచే నేరుగా వైసీపీ మీద‌ కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుందని మరి కొందరు నెటిజ‌న్లు అన్నారు. ఈ మధ్య కాలంలో చూసిన మంచి మూవీ ఇదేన‌ని, నెగెటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తారంటూ ఓ నెటిజన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.



    ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ మూవీ  తీశార‌ని,  రమ్యకృష్ణన్ విశాఖ వాణి పాత్ర‌లో అదరగొట్టార‌ని, సినిమా బిగ్ హిట్ అంటూ ప్రేక్ష‌కులు సాయి ధరమ్ తేజ్‌కు శుభాంకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఓ నిజాయితీ గల సినిమాను చూశాను.. చూస్తున్నంత సేపు ఆలోచ‌న‌లో ప‌డేసింద‌ని,  థియేటర్ బయటకి వచ్చాక కూడా ఆలోజింప‌జేసి, మనసులో నిలిచే సినిమా రిపబ్లిక్ అని, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటనలో పది మెట్లు ఎక్కినట్టుగా ఉంది. ఎన్నో మంచి సన్నివేశాలు, సంభాషణలు దేవా కట్టా గారి మార్క్‌కు అద్దం ప‌డుతున్నాయని ట్వీట్ల‌ర్ వేధికంగా ప్ర‌శంసించాడు ఓ నెటిజ‌న్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: