యువ భామ రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా తన కెరీర్ ని కెరటం సినిమా ద్వారా మొదలెట్టారు. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో మంచి సక్సెస్ కొట్టిన రకుల్, ఆపైన లౌక్యం తో పాటు నాన్నకు ప్రేమతో వంటి మరికొన్ని సక్సెస్ లు అందుకున్నారు. ఆ తరువాత నుండి రకుల్ చేసిన సినిమాల్లో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయాయి. అనంతరం అటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసిన రకుల్ కమల్ తో శంకర్ తీస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 లో కూడా యాక్ట్ చేస్తోంది.

అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుండడంతో పాటు శారీరకంగా ఎంతో సన్నబడి అందరి నుండి విమర్శలు అందుకున్న రకుల్ ప్రీత్ నటించిన లేటెస్ట్ సినిమా కొండపొలం . వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాని క్రిష్ తెరకెక్కించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని సాయి బాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. హృద్యమైన కథ, కథనాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకడు క్రిష్ తీసిన ఈ సినిమాపై పలువురు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజానికి కొండపొలం సినిమాని పూర్తిగా ఒక పాయింట్ ని బేస్ చేసుకుని పెద్దగా కమర్షియల్ హంగులు జోడించకుండా కథనాన్ని దర్శకుడు క్రిష్ ముందుకు తీసుకెళ్లిన తీరు గురించి అందరూ ఎంతో బాగా చెప్పుకుంటున్నారు. సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండగా కీరవాణి అందించిన నేపధ్య సంగీతంతో పాటు సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్తున్నారు. ఓవరాల్ గా అందరి నుండి బాగా పేరు అందుకుని కొండపొలం మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా రకుల్ కి హిట్ లభించింది. ఈ సినిమాలో ఓబులమ్మ గా ఆమె నటన ఎంతో బాగుందని అంటున్నారు. మొత్తంగా కొండపొలం సక్సెస్, ఆ టీమ్ అందరిలో బాగా జోష్ ని నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: