టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి 4 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమా కూడా ఒకటి. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్టయిన 'వేదాళం' అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలై మంచి రెస్పాన్స్ కనబరిచాయి. ఇక సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న..

 ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండటంతో ఆ పాత్రకి కీర్తి సురేష్ ని చిత్ర టీం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా ఎవరు హీరోయిన్గా నటిస్తున్నారు అనే విషయం పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో చిరు కి జోడిగా తమన్నా నటించబోతున్నట్లు కొన్ని కథనాలు వినిపించాయి. ఇక గతంలో సైరా సినిమాలో మెగాస్టార్ కి జోడీగా తమన్నా ఓ కీలక పాత్రలో నటించింది. అయితే సినిమాలో అది కంప్లీట్ హీరోయిన్ పాత్ర అని చెప్పలేము కానీ.. ఆ సినిమాలో తమన్నా తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు 'బోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా నటించబోతున్నట్లు అటు దర్శకుడు మెహర్ రమేష్ కానీ,ఇటు నిర్మాత అనిల్ సుంకర కానీ అధికారికంగా ప్రకటించలేదు.

కానీ ఇప్పుడు ఆమె భోళా శంకర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. ఇక వేదాళం సినిమాలో మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు అన్నీ ఉంటాయి. అందులో మంచి మాస్ పాటలకు కూడా స్కోప్ ఉంటుంది. అలాంటి తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ లో తమన్నా కనుక హీరోయిన్గా నటించి ఉంటే మెగాస్టార్ చిరంజీవి తో అదిరిపోయే స్టెప్పులు వేసేది. మరోవైపు తమన్నా తో స్టెప్పులు వేయాలని ఉందంటూ చిరు ఓ సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బోళా శంకర్ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: