బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో ఈ సీజన్ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే 11 వారాల ను విజయవంతంగా పూర్తి చేసుకొని పన్నెండో వారం లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్. ఇక గతవారం ఆనీ మాస్టర్ తో కలిపి 11 మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్లో ఇంకా ఎనిమిది మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. మరో మూడు వారాల్లో మరో ముగ్గురు ఎలిమినేట్ అయి వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరో చర్చ ఆసక్తికరంగా మారింది. అదేంటంటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఏ సెలబ్రిటీ గెస్ట్ గా వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

 ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఓ ఆసక్తి కరమైన సమాధానం కూడా వినిపిస్తోంది. టెలివిజన్ లెక్కల ప్రకారం బిగ్ బాస్ 5వ సీజన్ కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 19న నిర్వహించబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కోసం రెండు రోజులపాటు చిత్రీకరణ చేసి ఒకే రోజున టెలికాస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. గత నాలుగో సీజన్ కూడా ఇలాగే చేశారు నిర్వాహకులు. విజేత ఎవరు అనే తెలియకుండా ఉండడానికి ఈ మార్పు చేశారు. అదే మార్పును తాజా సీజన్ కి కూడా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇక మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ ఐదవ సీజన్ ఫినాలే లో సందడి చేయబోయేది 'త్రిబుల్ ఆర్' టీం అని తెలుస్తోంది. ఈ సినిమా కీలక సభ్యులైన డైరెక్టర్ రాజమౌళి హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ స్టేజిపైకి వస్తారని సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత బిగ్ బాస్ స్టేట్ ఎక్కినట్లు అవుతుంది. బిగ్ బాస్ తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ దాని తర్వాత మళ్లీ ఈ వైపుకి రాలేదు. ఇక రామ్ చరణ్ అయితే మొన్నామధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయినప్పుడు ఒకసారి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. ఇక రాజమౌళి అయితే మొట్టమొదటిసారి రాబోతున్నాడు. మరి ఈ హడావిడి చూస్తుంటే ఈ సారి ఫినాలే మామూలుగా ఉండదని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: