ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ జీవితంలో పడిన కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ కాకముందు పడిన కష్టాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరి మనసు కదిలిపోతుంది. ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడు. 50కి పైగా సినిమాల్లోనటించాడు. కానీ ఆ తర్వాత మద్యానికి బానిసగా మారడంతో చివరికి అనారోగ్యం బారిన పడ్డాడు. ఇక ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన చివరికి ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయింది ఐశ్వర్య రాజేష్ కుటుంబం. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఐశ్వర్య రాజేష్ లను పెంచింది. అయితే బంధువులు సైతం ఇక ఆస్తులను లాక్కోవడం తో ఐశ్వర్య రాజేష్ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది..
ఆ తర్వాత ఇక ఇద్దరు అన్నయ్యలను ఒకే రోడ్డు ప్రమాదంలో కోల్పోయింది ఐశ్వర్య రాజేష్. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ ఇంటికి పెద్ద కొడుకుగా మారి అన్ని బాధ్యతలను భుజాన వేసుకుంది. ఈ క్రమంలోనే సన్ టీవీలో ఓ కామెడీ కార్యక్రమంలో యాంకర్ గా చేరింది ఐశ్వర్య రాజేష్. ఇక ఆ తర్వాత ఒక రియాలిటీ షోలో పాల్గొని ప్రైజ్ మనీ గెలుచుకుంది. దీంతో ఇక ఐశ్వర్య రాజేష్ పేరు ఎంతో మందికి తెలిసి పోయింది. తర్వాత 2011 లో మొదటి సారి ఒక తమిళ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కొన్నాళ్లపాటు స్నేహితురాలి పాత్రల్లో నటించి ఇక తన నటనతో దర్శకనిర్మాతలు ఆకర్షించింది. ఇలా వరుసగా అవకాశాలు అందుకుని హీరోయిన్ గా అవతారమెత్తింది. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్.