తెలుగులో భారీ స్థాయి మార్కెట్ కలిగి ఉన్న దర్శకుడు సూర్య. ఆయన హీరోగా ఆయన నటించిన గజిని చిత్రం నుంచి తెలుగులో తన సినిమాలను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి తీసుకువచ్చి ఇక్కడ భారీ స్థాయిలో అభిమానాన్ని ఏర్పరుచుకున్నాడు ఈ తమిళ హీరో. తెలుగు హీరోలలానే అందరిలో కలిసిపోయాడు. ఆయన గత కొన్ని సినిమాలుగా దేశం మొత్తం తన వైపు చూసుకునెలా చేస్తున్నాడు. ఆయన నటించిన గత చిత్రం జై భీమ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా అది ఆస్కార్ నామినేషన్ కావడం విశేషం.

తాజాగా ఆయన నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ యాక్షన్ సినిమా ఈటీ విడుదలకు సిద్ధం అవుతోంది. రాధే శ్యామ్ చిత్రం విడుదల రోజునే ఆ సినిమా కూడా విడుదల కాబోతున్నడంతో ఇప్పుడు కొంతమంది సినిమా ప్రియులు ఈ రెండు సినిమాలకు క్లాష్ తప్పదా అని భావిస్తున్నారు. మార్చి 11వ తేదీన ప్రభాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ముందు సూర్య నటించిన ఈ చిత్రం చిన్నదే అయినా కూడా ఆయనకు ఇక్కడ భారీ స్థాయిలో అభిమానం ఉన్న సంగతి మర్చిపోవద్దు .తప్పకుండా ఈ చిత్రం బాగుంటే భారీ కలెక్షన్లు సాధిస్తుంది.  

ఈ నేపథ్యంలో ఏదైనా సినిమాకి భారీ కలెక్షన్లు రావాలన్నా భారీ స్థాయిలో హిట్ అవ్వాలన్నా తప్పకుండా సోలో రిలీజ్ గానే వస్తే బాగుంటుంది. అలాంటి సూర్య ఈ టైంలో రిస్క్ చేయడం అవసరమ అని ఆయన తెలుగు అభిమానులు చెబుతున్నారు. అయితే ఇది ద్విభాషా చిత్రం కావడం తమిళంలో ఈ చిత్రానికి పోటీగా ఏ సినిమా లేకపోవడం వల్ల ఆ రోజున విడుదల కావడం జరుగుతుంది. మరి ఈ చిత్రం ఏ విధంగా రాధే శ్యామ్ చిత్రాన్ని నిలువరిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. తొందర్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: