తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మెంటల్ మదిలో సినిమాతో మొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నివేద పేతురాజ్.. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. చిత్రలహరి, రెడ్, పాగల్, అలా వైకుంఠపురం సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో కూడా కనిపించబోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈమె డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల కావడం జరిగింది వాటి గురించి చూద్దాం.


నివేద పేత్ రాజ్ ప్రధానపాత్రలో బ్లడీ మేరీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజున వెలుబడ్డాయి.. కార్తికేయ, సవ్యసాచి వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ చందు మొండేటి.. ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీ ఆహా లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నివేద పేతురాజ్ చాలా కోపంగా.. ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. ఇక ఆమె ప్రపంచంతో పోరాడే మహిళ గా చెడ్డ వాళ్లకు చట్టం మహిళా గా కనిపిస్తోందని ఇందులో చెప్పబడింది.
మేరీ తనలోని లోపాలను అధిగమించి తనకు ఎదురయ్యే సమస్యలపై.. ఎలా పోరాటం చేస్తోంది అని ఒక కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించబడింది అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రాజ్ కుమార్, బ్రహ్మాజీ, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించడం జరిగింది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ వెబ్ సిరీస్ కు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: