టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవల వకీల్ సాబ్ తో పాటు కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమాలతో కెరీర్ పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాని తరువాత ప్రస్తుతం క్రిష్ తో ఆయన చేస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూట్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే దాదాపుగా పదేళ్ల క్రితం మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతి త్వరలో ఆయనతోనే మరొక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ని ఇటీవల ఖరారు చేసిన యూనిట్, మే లో దీనిని పట్టాలెక్కించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ భారీ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ని ఎంతో పవర్ఫుల్ గా రాసుకున్నారట. అలానే మిగతా ఇతర స్టార్ క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక నిపుణులని సైతం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారట.
అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి ఒక కీలక రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో టాలీవుడ్ లో మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా సినిమాలో ఢిల్లీశ్వర రావు పాత్ర చేసి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు పంకజ్. అలానే బాలీవుడ్ లో మీర్జాపూర్, కాగజ్, బంటి ఆర్ బబ్లీ 2, 83 సహా అనేక సినిమాల్లో పలు పాత్రల్లో నటించి మంచి పేరు అందుకున్నారు పంకజ్ త్రిపాఠి. ఇక త్వరలో పవన్ సినిమాలో కూడా ఆయన ఒక పవర్ఫుల్ రోల్ చేయనున్నారట. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. మొత్తంగా అందరిలో ప్రారంభం నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ రేపు పట్టాలెక్కి , ఆపైన తెరకెక్కి అనంతరం రిలీజ్ తరువాత ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: