టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  నిఖిల్ సిద్ధార్థ్ 'హ్యాపీ డేస్'  సినిమా ద్వారా మంచి గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ సోలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా విజయాలు  మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయాయి,  అలాంటి సమయం లోనే నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామి రారా మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు,  ఆ తర్వాత ఈ హీరో నటించిన కార్తికేయ,  ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు  కూడా మంచి విజయలను సాధించడం తో నిఖిల్ సిద్దార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా మారిపోయాడు.

ఇది ఇలా  ఉంటే ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ 18 పేజెస్ , కార్తికేయ టు సినిమా లో హీరోగా నటిస్తున్నాడు, ఇది ఇలా ఉంటే కార్తికేయ సినిమాకు కార్తికేయ టు సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది.  కార్తికేయ టు సినిమా లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది,  నితిన్ కెరియర్ లోనే కార్తికేయ టు సినిమా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది,  థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్ ,  అభిషేక్ అగర్వాల్ –ల్,  వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు, ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది,  ఈ మూవీ లి బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు, ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: