పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టారు. రానా దగ్గుబాటి కూడా ఒక ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా సముద్రఖని, రావురమేష్, మురళి శర్మ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు చేసారు. థమన్ సంగీతం అందించిన భీమ్లా నాయక్ మూవీలోని సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇక రిలీజ్ తరువాత మూవీ కూడా పెద్ద సక్సెస్ కొట్టి మంచి కలెక్షన్ ని అందుకుంది. సినిమాలో పవన్, రానా ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు పలు మాస్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అలానే ఎమోషనల్ గా కూడా అందరినీ అలరించేలా దర్శకుడు సాగర్ ఈ సినిమాని ఎంతో బాగా తెరకెక్కించారు. మొత్తంగా భీమ్లా నాయక్ సూపర్ సక్సెస్ అటు పవన్ కి ఇటు రానా కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక దీని తరువాత పవన్ చేస్తున్న భారీ ప్రాజక్ట్ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి తీస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని ని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హరిహర వీరమల్లు కి సంబంధించి ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి కాగా తదుపరి షూట్ ని అతి త్వరలో ప్రారంభించనున్నారు. మరోవైపు ఆ సినిమాలోని వీరమల్లు పాత్ర కోసం పవన్ మరింత పవర్ఫుల్ గా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే కథ కథనాలతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, అలానే రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: