ఇండస్ట్రీలో కొందరు ఎంత త్వరగా కనెక్ట్ అయ్యి ప్రేమించుకుని వివాహం చేసుకుంటారో.. అంతే త్వరగా మనస్పర్ధలు రావడంతో మ్యారేజ్ కి బ్రేక్ చెప్పుకుని విడిపోతున్నారు. ఇదే లిస్ట్ లోకి అక్కినేని నాగచైతన్య - సమంతలు కూడా చేరడం నిజంగా బాధాకరమైన విషయం. గతేడాది ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని తెలుగు ప్రేక్షకుల మనసు ముక్కలు చేశారు. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న ఈ జంట వివాహ బంధం లోకి అడుగు పెట్టిన మూడేళ్లకే పలు కారణాల వల్ల విడిపోయింది. కొన్నాళ్ళు సామ్ మానసికంగా కుంగిపోయారు అని వార్తలు వినిపించినా ప్రస్తుతం అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఎవరి కెరీర్ లో వారు ఫుల్ బిజీ అయిపోయారు. చెప్పాలంటే విడాకుల తర్వాత చైతు, సామ్ లు ఇద్దరు కూడా కెరియర్ లో స్పీడ్ పెంచారు.

నాగ చైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు 2 సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూకుడు పెంచారు. కాగా ప్రస్తుతం చైతు తన లైఫ్ లో సామ్ పార్ట్ గురించి పూర్తిగా మరిచిపోయారు అని మరో అమ్మాయిని తన జీవితం లోకి ఆహ్వానించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రెజెంటర్ టాలీవుడ్ లో చైతు సెకండ్ మ్యారేజ్ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. చైతు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న విషయం నిజమే అని సమాచారం. తండ్రి నాగార్జున చెప్పడంతో సరే అన్నారని అంటున్నారు. అయితే ఈ సారి చైతు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇండస్ట్రీకి సంబందించిన అమ్మాయి కాదని సమాచారం. మొదటి సారి సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య ఈ సారి తన లైఫ్ పార్టనర్ విషయాన్ని పూర్తిగా తండ్రి నాగార్జున నిర్ణయానికే  వదిలేశారట.

దాంతో నాగ్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ గారి తరపున ఒక అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు చైతు కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ అమ్మాయికి ఒక సోదరి కూడా ఉందని కుదిరితే ఆ అమ్మాయిని అఖిల్ కి ఇచ్చి ఒకే సారి రెండు పెళ్లిళ్లు చేయాలని అనుకుంటోందట అక్కినేని ఫ్యామిలీ. మరి ఈ విషయం గురించి ఒక క్లారిటీ రావాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: