టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయిన ఆది సాయి కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయికుమార్ 'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఆది సాయి కుమార్ మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా నటుడిగా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన లవ్లీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 

వరుసగా రెండు విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఆది సాయి కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలా వరుసగా రెండు విజయాలు అందుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత మాత్రం  బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో చాలా వరకు స్లో అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ సరైన విజయాలు మాత్రం ఆది సాయి కుమార్ కు బాక్సాఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది 'క్రేజీ ఫెల్లో' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫణికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో ఫణికృష్ణ దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టబోతున్నారు. ఈ మూవీ లో ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మూవీ ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ సినిమాతో ఆది సాయి కుమార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: