ప్రస్తుతం ఎన్నడూ లేవి విదంగా అక్కినేని నాగచైతన్య వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.తాజాగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వవ వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు నిర్మించారు.ఇదిలావుంటే ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు.అయితే మ్యూజిక్ సెన్షేషన్ తమన్ స్వరాలు సమకూర్చారు. కాగా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ జూలై 22న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 

ఇక ఇదిలావుండగా  మరోవైపు నాగచైతన్య విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలోనే `దూత` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగచైతన్య ఈ సిరీస్ తోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.అయితే  హారర్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్‌తో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.ఇక  ఇందులో చైతు ఇప్పటివరకు చేయనటువంటి డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇక  తాజాగా డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ `దూత` వెబ్ సిరీస్‌పై నయా అప్డేట్ ఇచ్చారు.ఇదిలావుంటే  `థ్యాంక్యూ` ప్రమోషన్స్ భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్లొన్నారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో `దూత` ప్రస్తావన వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే విక్రిమ్ కె కుమార్ మాట్లాడుతూ..“నాగ చైతన్య, నేను కలిసి 'దూత' అనే వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజుతో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే మరో 15 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఇక త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌ను అనౌట్స్ చేస్తాం“ అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీంతో చైతు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.ఇక ఈనెల 22వ తేదీన విడుదల కాబోతున్న థాంక్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 16న హైదరాబాద్లో ఇంత గ్రాండ్ గా జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు సమాచారం....

మరింత సమాచారం తెలుసుకోండి: